: తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్న తరుణ్... తరుణ్ కు ప్రత్యేక ప్రశ్నావళి?

టాలీవుడ్ యువనటుడు తరుణ్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. మాస్టర్ తరుణ్ గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తరుణ్... యువ నటుడిగా విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రికెటర్ కావాలని కలలు కని, హీరోగా సినిమాలతో ఆకట్టుకున్న తరుణ్ సొంతంగా పబ్ ను నడుపుతున్నాడు. ఈ పబ్ నుంచే ఇతర పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తరుణ్ పై సంధించేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నివాసం నుంచి తండ్రి చక్రపాణితో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరుణ్ చేరుకున్నాడు.

పూరీని 13 గంటలు, శ్యామ్ కే నాయుడును 11 గంటలు, సుబ్బరాజును 13 గంటలు విచారించిన సిట్ అధికారులు తరుణ్ ను ఎంతసేపు విచారించనున్నారో తెలియాల్సి ఉంది. కాగా, 11 గంటలకు పబ్  ఓనర్లలో అకున్ సబర్వాల్ భేటీ కానున్న నేపథ్యంలో, ఈ భేటీలో తరుణ్ కూడా పబ్ యజమానిగా పాల్గొనాల్సి ఉంటుంది. కాగా, తరుణ్ 'ఆన్ పబ్'ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సినీ అవకాశాలు లేని తరుణ్...లావిష్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఈ లైఫ్ స్టైల్ కు డబ్బు ఎలా వస్తుందన్న దానిపై సిట్ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News