: డ్రగ్స్ చేరవేసే కంపెనీలు ఇవే!

కొరియర్ ద్వారా డ్రగ్స్ పలువురు వినియోగదారులకు చేరుతున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ను ప్రముఖ కొరియర్ సంస్థలైన డీహెచ్ఎల్, బ్లూడార్ట్, ఫెడెక్స్ కొరియర్ సంస్థల ద్వారా వినియోగదారులకు చేర్చుతున్నట్టు డ్రగ్ పెడ్లర్లు వెల్లడించారు. దీంతో ఈ సంస్థల్లో ఉన్నతాధికారులను పిలిచిన సిట్ అధికారులు విచారించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారికి సిట్ అధికారులు సూచించారు. కొరియర్ చేసే వారినుంచి అన్ని వివరాలు తీసుకున్న తరువాత మాత్రమే వస్తువులను స్వీకరించాలని వారు చెప్పారు. 

More Telugu News