: సిట్ విచారణలో పూరీ జగన్నాథ్ ఏం చెప్పాడంటే...!

సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగించే వారిలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న సిట్ ముందు విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్ పూర్తిగా పోలీసులకు సహకరించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న తాను సరదాగా ఛార్మీ, ముమైత్ ఖాన్ కు ఇచ్చినట్టు తెలిపాడని సమాచారం. అలాగే మరికొందరు సరదాగా డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పాడని కూడా తెలుస్తోంది.

అనంతరం శ్యామ్ కే నాయుడును విచారించిన సిట్ అధికారులు పూరీ చెప్పిన విషయాలను నిర్ధారించుకున్నట్టు సమాచారం. సుమారు 13 గంటలు పూరీని సిట్ అధికారులు విచారించగా, 7 గంటలపాటు శ్యామ్ కే నాయుడును విచారించడం విశేషం.  

More Telugu News