: పూరీ జగన్నాథ్ కుమారుడికి కితాబు.. టాలీవుడ్ టాప్ హీరోతో పోల్చిన ఎక్సైజ్ సిబ్బంది!

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను నిన్న సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరీతో పాటు ఆయన కుమారుడు ఆకాశ్, తమ్ముడు సాయిరాం శంకర్ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం విచారణ కోసం జగన్ ను లోపలకు తీసుకెళ్లారు. వీరిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆకాశ్ తో పలువురు అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళా ఉద్యోగి ఆకాష్ కు ఓ ప్రశంసను ఇచ్చారు. "అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నావ్... హైటు, కలర్ అంతా మహేషే" అంటూ ఆమె కితాబిచ్చారు. సెల్ఫీలు దిగిన తర్వాత ఆకాష్, సాయిరాం శంకర్ లు సిట్ గది ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

More Telugu News