: సిట్‌ ఆఫీస్‌ వద్దకు చేరుకున్న దర్శకుడు పూరీ భార్య, మేనమామ!

డ్రగ్స్ వ్యవహారంలో విచారణ నిమిత్తం ఈ రోజు ఉదయం దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్, కుమారుడు ఆకాశ్ తో కలిసి నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం పూరీని ఐదో అంతస్తులోకి అధికారులు తీసుకువెళ్లగా, సాయిరామ్, ఆకాశ్ మాత్రం అక్కడే వేచి ఉన్నారు. అయితే, ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకే విచారణ పూర్తి కావాల్సి ఉండగా, ఇంత వరకూ ముగియకపోవడంతో పూరీ భార్య, ఆయన మేనమామ కార్యాలయానికి చేరుకున్నారు.  

More Telugu News