: లంచ్ చేసి వ‌చ్చి.. మ‌ళ్లీ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతున్న పూరీ జ‌గ‌న్నాథ్

టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతున్న డ్ర‌గ్స్ కేసులో ఈ రోజు ఉద‌యం 10.30 నుంచి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌ని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్ర‌శ్నిస్తున్న విష‌యం తెలిసిందే. పూరీకి కాసేపు బ్రేక్ ఇచ్చిన అధికారులు ఆయ‌న‌ లంచ్ చేసి వ‌చ్చాక‌ మ‌ళ్లీ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రో గంట సేపు ఈ విచార‌ణ కొన‌సాగ‌నుంది. మాద‌క ద్ర‌వ్యాల ముఠాతో ఆయ‌న‌కు ఉన్న సంబంధం, ప్ర‌ధాన నిందితుడు కెల్విన్ ఎలా ప‌రిచ‌యం అయ్యాడ‌న్న విష‌యంపై పోలీసులకు ఇప్ప‌టికే పూరీ స‌మాధానం చెప్పిన‌ట్లు తెలుస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఎక్సైజ్ శాఖ కార్యాల‌యానికి తీసుకొచ్చిన నేప‌థ్యంలో అక్క‌డ భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. పూరీ త‌ప్పు చేశాడ‌ని రుజువైతే ఈ కేసులో ఆయ‌న‌ను ఓ ఎవిడెన్స్‌గా తీసుకోవ‌చ్చ‌ని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

More Telugu News