nagarjuna: నాగ్ నిర్ణయంతోనే 'రాజుగారి గది 2' రిలీజ్ వెనక్కి!

'రాజుగారి గది 2' సినిమాతో కెరియర్లో మొదటిసారిగా నాగార్జున ఒక హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు. సమంతా .. శీరత్ కపూర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, షూటింగ్ పూర్తి చేసుకుని కొంతకాలమైంది. అయితే నాగ్ కొన్ని సీన్స్ కి రీ షూట్ పెట్టించడం వలన ఆలస్యమైంది. రీ షూట్స్ పూర్తి కావడంతో, ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ గ్రాఫిక్స్ నిడివిని కూడా మరి కొంత పెంచితే బాగుంటుందని నాగార్జున సూచించారట. గ్రాఫిక్స్ వర్క్ సంతృప్తికరంగా వచ్చాకే రిలీజ్ చేయడం మంచిదని చెప్పారట. దాంతో ఈ సినిమాను అక్టోబర్ కి వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగ్ .. సమంతాల కారణంగా ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుంది. సక్సెస్ లోను ఆ భారీతనం కనిపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

More Telugu News