: భీకర ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం.. పాక్ కాల్పుల్లో భారత జవాను వీర మరణం

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు  జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు వెంబడి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో భారత జవాను ఒకరు వీర మరణం పొందారు. ట్రాల్ ‌లోని అటవీప్రాంతంలో ఉగ్రవాదులు తచ్చాడుతున్నట్టు అందిన సమాచారంతో సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఓ గుహలో దాక్కున్న ఉగ్రవాదులను లొంగిపోవాల్సిందిగా భద్రతా దళాలు కోరాయి. వారు తిరగబడి కాల్పులు ప్రారంభించడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ సాయంత్రం వరకు కొనసాగినట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వీరిలో ఇద్దరు స్థానికులు కాగా, మరొకరు పాకిస్థానీ అని పేర్కొన్నారు. కాగా, సరిహద్దు వెంబడి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో లాన్స్ నాయక్ మొహమ్మద్ నజీర్ (35) వీరమరణం పొందాడు.

More Telugu News