: డైహార్డ్ చికెన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కేఎఫ్‌సీ నుంచి బ్రహ్మాండమైన స్మార్ట్‌ఫోన్!

కేఎఫ్‌సీని అమితంగా ఇష్టపడే వారికి మరో శుభవార్త. కేఎఫ్‌సీ, చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి కలిపి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేశాయి. చైనాలో కేఎఫ్‌సీని ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. కేఎఫ్‌సీ హువేయి 7 ప్లస్ పేరుతో పరిమిత సంఖ్యలో ఈ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చారు. రెడ్ కేసింగ్‌తో ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోన్‌ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.10వేలు. 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఇందులో కేఎఫ్‌సీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేశారు. అలాగే కె-మ్యూజిక్ యాప్‌ కూడా ఉంది. అమెజాన్‌లాగా చైనాలోని ఈ-కామర్స్ దిగ్గజం టిమాల్‌లో నేటి (గురువారం) నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

More Telugu News