chiranjeevi: 'ఉయ్యాలవాడ'ను ఆ రోజునే లాంచ్ చేస్తారట!

చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా రూపొందుతోంది. చరణ్ నిర్మాణంలో .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా ఐశ్వర్యారాయ్ .. సోనాక్షి సిన్హా పేర్లు వినిపిస్తున్నాయి.

 ముందుగా ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న లాంచ్ చేయాలనుకున్నారు. అయితే ఇది ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథ కనుక, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న లాంచ్ చేయడం సందర్భానికి తగినదిగా వుంటుందనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ విషయం పై ఈ సినిమా టీమ్ స్పష్టమైన ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.     

More Telugu News