mahesh babu: రకుల్ తో విదేశాలకి వెళుతోన్న మహేశ్!

మురుగదాస్ - మహేశ్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'స్పైడర్' సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్లు. అందువలన ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో మురుగదాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ఒక్క పాట మినహా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణంతా పూర్తయింది. ఈ పాటను వచ్చేనెల మొదటి వారంలో చిత్రీకరించనున్నారనే వార్త కూడా బయటికి వచ్చింది.

 ఆ పాటను ఆగస్టు 2వ తేదీన మొదలు పెట్టి 4 రోజుల పాటు తెరకెక్కించనున్నారనేది తాజా సమాచారం. యూరప్ లోని పలు అందమైన లొకేషన్స్ లో మహేశ్ బాబు - రకుల్ పై ఈ పాటను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటల్లోకి ఇది హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చకచకా గ్రాఫిక్స్ పనులను కూడా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.   

More Telugu News