: అప్పుల బాధలు భరించలేక గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య!

అప్పుల బాధలు మరో రైతు ఉసురు తీశాయి. శ్రీనివాసరావు (40) అనే వ్యక్తి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన రైతు. సొంతంగా రెండెకరాలు, కౌలుకు మరో రెండెకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేయడానికి భారీగా అప్పులు చేశాడు. పంట సరిగా రాక, అప్పులు పెరిగిపోవడంతో... వేరే దారిలేక తన పొలంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

More Telugu News