: ఆంత్రాక్స్ వ్యాపిస్తుందనే భయంతో చేతి వేలిని నరికేసుకున్న గిరిజనుడు

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. ఆంత్రాక్స్ వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో ఓ గిరిజనుడు తన చేతి వేలిని నరికేసుకున్నాడు. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన గిరిజనుడు ఈ పనికి పాల్పడ్డాడు. వెంటనే, అరకులోయ ఆసుపత్రికి అతన్ని తరలించారు. కాగా, విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కేసుల సంఖ్య 20కి పెరిగింది. అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురికి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే.

More Telugu News