: అవినీతి సామ్రాట్‌ జగన్‌: టీడీపీ నేతలు

వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా విమర్శించారు. వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్లీనరీపై వారు మాట్లాడుతూ, ప్రజలను తప్పుదారిపట్టించేలా ఆ ప్లీనరీ ఉందని మండిపడ్డారు. అవినీతి సామ్రాట్‌ అయిన జగన్‌.. అవినీతిపై పుస్తకాలు ముద్రించడం చాలా హాస్యాస్పదమని అన్నారు. వైఎస్సార్ హయాంలో జగన్‌ అవినీతిని చూసి ప్రజలు భయపడిపోయారని ఈ సందర్బంగా విమర్శించారు.

More Telugu News