: బాబా గుడిలో కాళ్లు కడిగించుకున్న జార్ఖండ్ సీఎం!

జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ వివాదంలో పడ్డారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా జంషెడ్ పూర్ లోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువర్ దాస్ కు స్వాగతం పలికే క్రమంలో ఆలయానికి చెందిన ఇద్దరు మహిళలు ఆయన కాళ్లు కడిగారు. ఆలయ మహిళలు ఈ విధంగా చేయడమేంటంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News