: రాజమౌళి నెక్ట్స్ చిత్రం హీరో ఎన్టీఆర్?

దర్శకుడిగా తన తొలి చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1' తో పాటు ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన రాజమూళి, 'బాహుబలి' తరువాత మరోసారి ఎన్టీఆర్ తో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. బాహుబలితో వచ్చిన క్రేజ్ తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు రెడీగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం మరోసారి ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడని సమాచారం.

ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్ తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ టీవీ షోతో పాటు జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్ వన్ ముగుస్తుంది. ఆ తరువాత జక్కన్నతో సినిమా ఉంటుందన్నది సినీ వర్గాల కథనం.

More Telugu News