: తల్లికి స్వయంగా కర్మకాండ నిర్వహించిన రేణుక చౌదరి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి తల్లి వసుంధర దేవి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆమెకు రేణుక చౌదరి స్వయంగా కర్మకాండలు నిర్వహించారు. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురూ కుమార్తెలే జన్మించారు. వీరిలో రేణుక అందరికన్నా పెద్దవారు. ఈ అంత్యక్రియలకు ఆమె కుటుంబసభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.  

More Telugu News