: ‘మరుదనాయగం’పై కమల్ సంచలన నిర్ణయం

ప్రముఖ విలక్షణ నటుడు కమలహాసన్ సుమారు ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన చిత్రం మరుదనాయగం.1997లో బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా చాలా అట్టహాసంగా ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్రం మొదట్లోనే ఆగిపోయింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం ఇక పూర్తి కాదని సినీ వర్గాలు అనుకున్నాయి. ఈ విషయమై కమల్ ఇటీవల స్పందిస్తూ, ‘మరుదనాయగం’ను సినిమాగానే కాకుండా వెబ్ సిరీస్, టీవీ సిరీస్ రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాగా, కమల్ తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మళ్లీ తిరిగి మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

More Telugu News