: మోదీ భార్య దిగుతారని డోర్ తెరచి పట్టుకున్న సెంట్రీ... ఆపై విస్మయం!

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు స్వాగతం పలికేందుకు సిద్ధమైన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వెట్ హౌస్ వద్దకు ప్రధాని ప్రయాణిస్తున్న కారు రాగానే, సంప్రదాయ స్వాగతంలో భాగంగా తమ విధులు నిర్వహించిన సెంట్రీ గార్డులు, కారు సమీపానికి వెళ్లి నిలుచున్నారు. ప్రధాని కారులో కుడివైపు కూర్చుని ఉండగా, డోర్ తీయగానే ఆయన దిగిపోయారు. కారుకు రెండో వైపున్న సెంట్రీ కొద్దిగా కష్టపడి డోర్ తీసి ఎవరైనా దిగుతారేమోనని చూశాడు. ఆపై అతను ఒకింత బిత్తరపోయినట్టు వీడియోల్లో కనిపించింది.

ఇటువంటి పర్యటనల్లో దేశాధినేతల జీవిత భాగస్వాములు కారులో ఎడమవైపు కూర్చుంటారు. ప్రధాని సతీమణి కూడా వచ్చుంటారని భావించిన సెంట్రీ ఈ పని చేయగా, లైవ్ లో దీన్ని చూసిన నెటిజన్లు వెంటనే తమదైన కామెంట్లతో పోస్టులు గుప్పించారు. మోదీ ఒంటరిగా ఉన్నారన్న సంగతి అమెరికాకు తెలియదా? ఇలా రెండు డోర్లూ తీసే ఏర్పాట్లు ఎందుకు చేశారు? అని కొందరు ప్రశ్నిస్తుండగా, అది లాంఛన చర్య కావచ్చని మరికొందరు అంటున్నారు.

More Telugu News