: ఢిల్లీలో బోనమెత్తిన వెంకయ్యనాయుడు

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ కమిటీకి, అధికారులకు అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మన సంప్రదాయ పండుగలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

More Telugu News