: ఈ నెల 27 నుంచి వస్త్ర దుకాణాలు బంద్!

జీఎస్టీలో పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు బంద్ కు దిగనున్నారు. ఈ నెల 27వ నుంచి నాలుగు రోజుల పాటు బంద్ కు పిలుపు నిచ్చారు. 27,28,29 తేదీల్లో వస్త్ర దుకాణాలు పూర్తిగా మూతపడనుండగా, 30 తేదీన తమ దుకాణాల ఎదుట వస్త్ర వ్యాపారులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో టెక్స్ టైల్ జీఎస్టీ సంఘర్షణ సమితి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బంద్ పాటించనున్నారు.

More Telugu News