: అది యోగా ద్వారా సాధ్యమవుతుంది: సెహ్వాగ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు క్రీడాకారులు ఆసనాలు వేస్తూ, ఆ ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, బయట ఏం జరిగినా మనం నియంత్రించలేమని... అయితే, మన లోపల జరిగే వాటిని మాత్రం నియంత్రించుకోవడం సాధ్యమవుతుందని... అది యోగా ద్వారా సాధ్యమవుతుందని అన్నాడు.

తన జీవితంలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉందని టీమిండియా క్రికెటర్ ధావన్ ట్వీట్ చేశాడు. శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు.

More Telugu News