: దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న సివిల్స్ పరీక్ష

దేశ వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా సాగుతోంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అరవై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ రోజు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు తొలి పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు సీ-శాట్‌ రెండో పరీక్ష జరుగుతోంది. విజయవాడ కేంద్రంగా పదకొండు వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి నుంచి ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ పరీక్ష ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహించనున్నారు.

More Telugu News