: సిమ్లా మున్సిపల్ ఫలితాల్లో బీజేపీ ముందంజ... గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది. మొత్తం 34 మంది సభ్యులుగల మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికి 20 స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు 9 చోట్ల, కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. మూడు స్వతంత్రులకు వెళ్లాయి. సీపీఎం అభ్యర్థి ఒకటి గెలుచుకున్నారు. మరో 14 స్థానాలకు కౌంటింగ్ నడుస్తోంది. సిమ్లా మన్సిపాలిటీని కాంగ్రెస్ 26 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలగా, 2012లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను సీపీఎం గెలుచుకుంది.

More Telugu News