: స్నేహితులకు వీడియో మెసేజ్ పెట్టి భార్యతో కలసి ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్!

అత్తింటి వేధింపులు తాళలేక భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు వీడియో మెసేజ్ పంపి, ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం చెన్నైలో కలకలం రేపింది. ఎగ్మోర్ ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో పని చేసే సుందర పాండీ (29) కి రామంతాపురం ప్రాంతానికి చెందిన శశికళ (23) తో 18 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి రోజే వివాదం తలెత్తడంతో పెళ్లైన మరుసటి రోజు నుంచే వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో బంధువులు కలుగజేసుకుని, ఇది పధ్ధతి కాదని చెబుతూ ఇద్దర్నీ కలిసి నెల రోజులు ఉండమన్నారు.  తరువాత సమస్యలు సర్దుకోకపోతే ఆలోచిద్దామని సర్దిచెప్పారు.

దీంతో చెన్నయ్ లో బంధువుల ఇంట్లో వారిద్దరూ అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. దీంతో శశికళ జూన్ 12న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మళ్లీ భర్త వద్దకు వచ్చింది. అయితే, హఠాత్తుగా దంపతులిద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. తన అత్తమామల వేధింపుల వల్లే తన భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియో మెసేజ్ తీసి, దానిని కానిస్టేబుల్ తన స్నేహితులకు పంపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News