: ఛాంపియన్స్ లీగ్ లో ఫిక్సింగ్ వల్లే పాక్ ఫైనల్ కు వచ్చింది: పాక్ మాజీ దిగ్గజం సంచలన ఆరోపణలు

పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు అమీర్ సోహైల్ ఆరోపించాడు. పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి 1990లో అరంగేట్రం చేసి, పదేళ్లపాటు ఆ జట్టుకి ఓపెనర్ గా సేవలందించి, ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడిన పాక్ దిగ్గజ ఓపెనర్ అమీర్ సొహైల్ పాక్ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ అన్ని మ్యాచ్ లను కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఫిక్స్ చేశాడని అన్నాడు.

ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో బయటి శక్తులు కూడా పని చేశాయని చెప్పాడు. అక్రమ మార్గంలో పాక్ ఫైనల్ చేరిందని అమీర్ సొహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమీర్ సోహైల్ వ్యాఖ్యలతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. గతంలో ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పాక్ జట్టులో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఇంగ్లండ్ పటిష్ఠమైన జట్టు ఓటమిపాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News