: సెలవులకు వెళ్లిన విద్యార్థులు.. తరగతి గదులను కోళ్లఫారంగా మార్చేసిన హెడ్మాస్టర్!

స్కూలుకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇదే అదునుగా భావించిన ఓ హెడ్మాస్టర్ తరగతి గదులను పౌల్ట్రీఫాంగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్‌ రామ్‌పూర్‌ జిల్లాలోని దర్శన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ్ ప్రధాన్ భర్త హామీతో ఉపాధ్యాయుడు ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అంతేకాదు గ్రామానికి చెందిన ఇతర కోళ్లు కూడా స్కూలు పరిసరాల్లో కనిపించాయి. క్లాస్ రూములను కోళ్ల ఫారంగా మార్చిన వైనాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది వైరల్ అయింది. విషయం జిల్లా మేజిస్ట్రేట్‌కు చేరడంతో హెడ్మాస్టర్‌ ఫర్యాద్ అలీ ఖాన్‌, మరో ఉపాధ్యాయుడు ప్రయాగ్ కుమార్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

More Telugu News