: సహోద్యోగిని కాలుతో తన్నిన ఉద్యోగి...వీడియో చూడండి

కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయంలో సహాద్యోగిని కాలుతో తన్నిన ఘటనపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సింధనూర్ పట్టణ పురపాలక సంఘంలో ఓ ఉద్యోగి తన సహోద్యోగినిపై దారుణంగా ప్రవర్తించాడు. తన సీట్లోంచి లేచి వెళ్లి, ఆమెను కాలితో తన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కార్యాలయంలోని సీసీ టీవీ పుటేజ్ ను సేకరించారు. ఈ పుటేజ్ లో...మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తమ విభాగంలో పనులు చేసుకుంటుండగా, పురుష ఉద్యోగి తన సీట్లోంచి ఆగ్రహంతో లేచి వెళ్లి, వేరే సీట్లోకి వెళ్లిపోతున్న ఆమెను కాలితో తన్నిన విజువల్స్ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News