: ఇప్పుడే ఇంత ఘటికుడా... కొడుకు పోజ్ చూసి అల్లు అర్జున్ విస్మయం!

నిన్న రాత్రి అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘డీజే - దువ్వాడ జగన్నాథం’ ఆడియో విడుదల వేడుక జరుగుతున్న వేళ, తన కుమారుడు అయాన్ పెట్టిన పోజు చూసి బన్నీ విస్తుపోయాడు. ఇంతకీ బుజ్జి అయాన్ ఏం చేశాడో తెలుసా? ఓ రాజకీయ నాయకుడి తరహాలో అభిమానులకు అభివాదం చేశాడు. దిల్ రాజు మనవడు ఆర్షాన్ తో కలసి ఆడియోను లాంచ్ చేసిన అయాన్, ఎంతో క్యూట్ గా రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్న ఫోటోను అల్లు అర్జున్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయానని అన్నాడు. అయాన్‌ తీరు చూసి తాను ఆశ్చర్యపోయానంటూ చెప్పాడు. ఇక మనవడి పోజు చూసి అల్లు అరవింద్ నవ్వాపుకోలేకపోయారు. ఆ చిత్రాన్ని ఇక్కడ మీరూ చూడవచ్చు.

More Telugu News