: రష్యాలో కాల్పుల కలకలం.. తన ఇంటిలో నుంచి ఇతర ఇళ్లపైకి దుండగుడి కాల్పులు.. నలుగురి దుర్మరణం

రష్యాలోని మాస్కోలో ఓ దుండగుడు శనివారం బీభత్సం సృష్టించాడు. కాల్పులతో కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దక్షిణ మాస్కోలోని క్రతోవో గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన ఇంటిలో నుంచి ఇతర ఇళ్లపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇంటిని చుట్టుముట్టారు. దుండగుడి కాల్పుల్లో నలుగురు మృతి చెందారని, అతడి ఉద్దేశం ఏమిటన్న విషయం తెలియ రాలేదని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ పేర్కొంది.  ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపింది.

More Telugu News