: భద్రాచలం ఏపీ ప్రజల సొత్తు.. కాంగ్రెస్ అన్యాయం చేసింది!: బీజేపీ నేత సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. భద్రాచల రాముడు ఏపీ ప్రజల సొత్తు అని... కానీ, ఏపీవాసులకు అన్యాయం చేసి, భద్రాచలంను తెలంగాణకు అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని... స్పెషల్ స్టేటస్ కోసం సభలు పెట్టి, ప్రజలను రెచ్చగొట్టినంత మాత్రాన ఏమీ ఒరగదని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దక్షిణాదిలో బలపడటమే బీజేపీ ప్రస్తుత కర్తవ్యమని అన్నారు. మోదీ నాయకత్వం, అమిత్ షా వ్యూహాలు బీజేపీని బలోపేతం చేస్తాయని చెప్పారు.

More Telugu News