: పాల్వాయి మృతిపై వైఎస్ జగన్ సహా పలువురు నేతల సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. కాగా, పాల్వాయి మృతిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నేతలు కేశవరావు, జితేందర్ రెడ్డి తమ సంతాపం వ్యక్తం చేశారు. పాల్వాయితో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయా నేతలు గుర్తుచేసుకున్నారు.

More Telugu News