: రోడ్డు ప్రమాదంలో డీకే అరుణ భర్తకు గాయాలు

మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో... ఆయనకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను అంబులెన్స్ లో మహబూబ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న అరుణ హుటాహుటిన మహబూబ్ నగర్ కు బయల్దేరారు. మరోవైపు, ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News