: ఇరాన్ పార్లమెంట్ లోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డ దుండగుడు... ముగ్గురికి గాయాలు

ఇరాన్ పార్లమెంట్ ప్రాంగణలోకి చొరబడ్డ గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. పార్లమెంట్ లోని పలువురిని అతడు నిర్బంధించినట్టు సమాచారం. ఇరాన్ కు చెందిన వార్త సంస్థల కథనం ప్రకారం, ఇరాన్ పార్లమెంట్ లోకి ఈ రోజు ఉదయం చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తి, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఒక సెక్యూరిటీ గార్డు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News