: నాపై కేసులు పెడితే టీఆర్ఎస్ నేతలకు నిద్రలేకుండా చేస్తా: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమవడంతో మంత్రి హరీష్ రావు మెంటల్ గా మారారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమీన్ పూర్ భూముల కేసును తిరగదోడుతున్నారని, ఈ విషయమై సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. సర్పంచ్ తొలగింపు ఆపకపోతే కలెక్టర్ ను ఘెరావ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అమీన్ పూర్ భూముల కేసు వ్యవహారంలో తనపై కేసులు పెట్టిన మర్నాడే తన దమ్మేంటో చూపిస్తానని, టీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తానని జయప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

More Telugu News