: పవిత్ర తిరుమలలో రాజకీయ కామెంట్లా?: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శివసేన ఆగ్రహం!

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తిపారవశ్యంతో నిండి ఉండే తిరుమల ఆలయం వద్ద రాజకీయపరమైన కామెంట్లు చేస్తూ... ఆలయ పవిత్రతకు రోజా భంగం కలిగిస్తున్నారంటూ మండిపడింది. రాజకీయపరమైన కామెంట్లతో తిరుమలను అపవిత్రం చేస్తే... చూస్తూ ఊరుకోబోమని శివసేన నేతలు హెచ్చరించారు. తిరుమలకు వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని రోజాకు వార్నింగ్ ఇచ్చారు. 

More Telugu News