: భుజాన పసుపు కండువాతో అమ్మ, నానమ్మలతో వచ్చి దేవాన్ష్ సందడి

తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు ఘాట్ వద్దకు కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలసి వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన స్మారక చిహ్నంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. తల్లి ఒడిలో ఉన్న దేవాన్ష్ కు ఓ తెలుగుదేశం నేత పసుపు కండువా కప్పడం అందరినీ ఆకర్షించింది. ఆపై భువనేశ్వరి స్వయంగా దేవాన్ష్ మెడపై కండువాను సర్ది, ముత్తాతకు నమస్కారం ఎలా చేయాలో చూపించారు. అక్కడ ఏం జరుగుతుందో, తన చుట్టూ అంత హడావుడి ఏంటో తెలిసీ తెలియని వయసులో ఉన్న దేవాన్ష్, తల్లి ఒడిలోనే సందడి చేస్తూ ఉండిపోయాడు. వీరి వెంట పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వెంటవచ్చారు.

More Telugu News