: మరోమారు రికార్డులకెక్కిన మోదీ.. ఫేస్‌బుక్ ఫాలోవర్లలో ప్రపంచంలోనే టాప్!

సోషల్ మీడియాలో తనకు తిరుగులేదని ప్రధాని మోదీ మరోమారు నిరూపించారు. ఫేస్‌బుక్ ఫాలోవర్లలో ప్రపంచంలోనే ఆయన టాప్ లీడర్‌గా అవతరించారు. ఫేస్‌బుక్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అనుసరిస్తున్నవారి కంటే మోదీని అనుసరిస్తున్నవారి సంఖ్యే అధికమని తేలింది. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.17 కోట్లకు చేరుకుంది. మే 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 1.4 కోట్లు ఉన్న మోదీ ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 4.17 కోట్లకు చేరుకున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ తెలిపారు.

 నోట్ల రద్దు వంటి  పలు విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకున్నప్పటి నుంచి మోదీ ప్రభ ఒక్కసారిగా పెరిగినట్టు ఆయన చెప్పారు. మోదీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీ, జనరల్ వీకే సింగ్, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీ‌లకు ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజలతో సంబంధాల విషయంలో సమాచార మంత్రిత్వ శాఖ,  విదేశీమంత్రిత్వ శాఖ, రైల్వేశాఖలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

More Telugu News