: జగన్ ను కాపాడటం ఎవరి తరం కాదు.. రాజకీయ పబ్బం కోసమే శ్రీకాకుళం యాత్ర: రామ్మోహన్ నాయుడు

కేవలం జనాలను రెచ్చగొట్టడానికే వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జిల్లా ప్రజలకు ఏమేం కావాలో ప్రభుత్వం అన్నీ చేస్తోందని... అయినా ప్రజలను రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ పబ్బం కోసం ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. కేసుల నుంచి కాపాడమని అడుక్కోవడానికే ప్రధాని మోదీని జగన్ కలిశారని... కానీ, జగన్ ను ఎవరూ కాపాడలేరని అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు పైవ్యాఖ్యలు చేశారు. 

More Telugu News