: లోయర్ బెర్త్ కావాలా?.. తియ్ రూ. వంద.. ప్రయాణికులను బాదేందుకు సిద్ధమైన రైల్వే!

సందు దొరికితే చాలు ప్రయాణికులను బాదేందుకు రైల్వే రెడీ అయిపోతోంది. రైలు ప్రయాణాల్లో లోయర్ బెర్త్‌‌లకు డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకునేందుకు రైల్వే రంగం సిద్ధం చేస్తోంది. లోయర్ బెర్త్ కావాలనుకునే వారి నుంచి అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత మొత్తం అన్నది ప్రస్తుతానికి ఖరారు కాలేదు. త్వరలోనే రైల్వే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

నిజానికి లోయర్ బెర్త్‌లు కోనుకునే వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలే ఉంటారు కాబట్టి వారి నుంచి సర్‌చార్జి పేరుతో అదనంగా వసూలు చేయడం సరికాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైలులోని మొత్తం లోయర్ బెర్త్‌ల సంఖ్యలో 10-15 శాతాన్ని సీనియర్ సిటిజన్లకు కేటాయించాలన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో రైల్వేశాఖ ఈ విషయంలో డైలమాలో పడింది. అయితే త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా విమానాల్లో విండో సీట్లకు అదనంగా వసూలు చేస్తారు. ఇప్పుడు అదే పద్ధతిని రైల్వేలోనూ అమలు చేయాలన్నది రైల్వే ఉద్దేశంగా తెలుస్తోంది.

More Telugu News