: జమ్మూలో తొంభై ఏళ్లలో తొలిసారి.. ఆర్ఎస్ఎస్ సమావేశాలు!

జమ్మూకాశ్మీర్ లో తొంభై ఏళ్లలో తొలిసారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సమావేశాలు జరగనున్నాయి. జులైలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా విశ్వహిందూ పరిషత్ కు చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారు. జమ్మూతో పాటు లడఖ్, కాశ్మీర్ లోయలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్నా శాంతి భద్రతల సమస్యలు ఆటంకంగా మారుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం ఆయా చోట్ల బీజేపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ అధిష్ఠానం ఆశిస్తున్నట్లు సమాచారం.

More Telugu News