: 'మోదీ ఓ క్రిమినల్ ను పక్కన కూర్చోబెట్టుకుంటారా?... బీజేపీ నేతలే ఆలోచించుకోవాలి' అన్న అయ్యన్నపాత్రుడు

ప్రధాని నరేంద్ర మోదీ, దేశాభివృద్ధి కోసం గతంలో ఏ ప్రధానీ కష్టపడనంతగా శ్రమిస్తున్నారని చెబుతూనే, వైఎస్ జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి కలవడాన్ని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. ఈ ఉదయం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానానికి వచ్చి మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓ మహా మేధావి అయిన మోదీ, ఓ నేరగాడిని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని అన్నారు. మంత్రి మాణిక్యాలరావు సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వీటిపై బీజేపీ నేతలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీజేపీతో తాము మరో ఐదేళ్లు కలసి నడవాలని భావిస్తున్నామని చెప్పారు.

More Telugu News