: జగన్ ఎందుకు రాజీ పడ్డారు? మద్దతు ఎవరడిగారు?: జూపూడి

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ వెనుక ఉన్న రహస్యమేంటో బహిర్గతం చేయాలంటూ వైసీపీ అధినేత జగన్ ను ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలందరితో రాజీనామా చేయిస్తానని గతంలో ప్రకటించిన జగన్... ఇప్పుడు కేంద్రంతో ఎందుకు రాజీ పడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ ను ఎవరైనా అడిగారా? అడక్కుండానే మద్దతిస్తామంటూ మోదీని కలవాల్సిన అవసరం ఏమిటని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని మోదీకి జగన్ ఎందుకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. అవసరానికి ఏదైనా చేయడం జగన్ నైజమని అన్నారు. 

More Telugu News