: మీకు, విజయ్ మాల్యాకు తేడా ఏంటి?: జగన్ కు కళా వెంకట్రావు బహిరంగలేఖ

వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో జగన్ కు ఆయన పలు ప్రశ్నలను సంధించారు. ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీని కలిశానని తమరు చెప్పారని... మరి, రాష్ట్ర సమస్యలను వివరించడానికి ప్రధానిని కలిస్తే, దాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే హోదా తప్ప మీకు, విజయ్ మాల్యాకు ఉన్న తేడా ఏమిటని ఎద్దేవా చేశారు. ఆస్తులు జప్తు అయితే సగం నేరం రుజువైనట్టే అని అన్నారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను మొదటి అంశంగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జూన్ నాటికి తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని తమరు అన్నారని... ఆ మాటకు ఇంకా కట్టుబడి ఉన్నారా? అని లేఖలో నిలదీశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోదీకి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.  

More Telugu News