: నయీమ్ అనుచరుల పేరుతో బెదిరింపులు!

గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుల పేరుతో తాజాగా బెదిరింపులకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తనను బెదిరించి తొమ్మిది ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఘట్ కేసర్ పోలీసులకు రైల్వే మాజీ ఉద్యోగి పి.రత్నం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో భువనగిరి మాజీ ఎంపీటీసీ బీరు మల్లేష్, పింగళ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును భువనగిరి పోలీస్ స్టేషన్ కు బదలాయించారు.

More Telugu News