: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లకు ఎదురుదెబ్బ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యంగ్ ఇండియా కంపెనీపై విచారణ జరపాలంటూ ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అకౌంట్ లను తనిఖీ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. మరోవైపు, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళతామని రాహుల్ గాంధీ తెలిపారు. 

More Telugu News