: పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు: అశోక్ గజపతిరాజు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఓ ఉత్తరాది వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడమేంటని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించడం విదితమే. తాజాగా, ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, అతను సినిమా నటుడంటా, సినిమాలు చూసి చాలా కాలమైందని, టీటీడీ ఈవో ఎంపికపై తాను స్పందించనని అన్నారు.

More Telugu News