: తెలుగు ప్రేక్షకులకు సొంత వాయిస్ ను వినిపించేందుకు సిద్ధమైన కేథరీన్

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కేథరీన్ త్రెసా.... తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఆ జోరు ప్రదర్శించడంలో మాత్రం వెనుకబడింది. అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సోలో హీరోయిన్ గా సరైన బ్రేక్ మాత్రం ఆమెకి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టాలీవుడ్ లో పాగా వేయాలని భావించిన కేథరీన్... 'గౌతమ్ నందా'లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించింది.

మలయాళ హీరోయిన్లంతా సొంత గొంతుతోనే టాలీవుడ్ లో పాగా వేయడంతో ఈసారి ఎలాగైనా టాలీవుడ్ లో పాగా వేయాలని భావించిన ఆమె 'గౌతమ్ నందా' సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. దీంతో ఈసారి తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నారు.

More Telugu News