: ప్రకటనల కోసం జియో మోదీ ఫొటోలు అడగలేదు.. స్పష్టం చేసిన పీఎంవో
తమ ప్రకటనల్లో ఉపయోగించుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను రిలయన్స్ జియో, పేటీఎంలు అడగలేదని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ప్రకటనల్లో మోదీ ఫొటోలను వినియోగించుకున్నందుకు అనుమతి కోరుతూ కంపెనీలు, ట్రస్ట్లు, వ్యక్తులు దాఖలు చేసిన వివరాలను, అందుకు సంబంధించిన అనుమతి, లేదంటే తిరస్కరణ కాపీలను ఇవ్వాలని కోరుతూ పీటీఐ ప్రతినిధి ఒకరు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీఎంవో స్పందించింది. మోదీ ఫొటోలను అడిగిన వారి వివరాలను వెల్లడించలేమని పేర్కొంది. ప్రకటనల్లో మోదీ ఫొటోలను ఉపయోగించుకునేందుకు అనుమతి కావాలంటే రిలయన్స్ జియో కానీ, పేటీఎం కానీ విజ్ఞప్తి చేసినట్టు తమ వద్ద ఎటువంటి రికార్డు లేదని స్పష్టం చేసింది.