: వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని.. రైతులను జైల్లో పెట్టారు: కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్లీనరీ, బహిరంగసభలను నిర్వహించేందుకు వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసీఆర్... రైతులను మాత్రం జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగసభ కోసం ట్రాక్టర్లను బ్లాక్ చేసి, మిర్చి పంటను తరలించేందుకు రైతులకు ట్రాక్టర్లు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన విధ్వంసం కావాలని జరగలేదని... రైతుల బాధల్లోంచి పుట్టుకొచ్చిందని చెప్పారు. రైతులపై టీఆర్ఎస్ సర్కారు సవతి ప్రేమ చూపెడుతోందని విమర్శించారు. మిర్చి రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

More Telugu News